- హత్య కేసులో ఒక్కరు మైనర్ బాలుడు
- చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు
మన్యం టీవీ, కరకగూడెం : కరకగూడెం మండలం పరిధిలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీలో శివారులో గత నెల 25వ తేదీ రాత్రి నాలి సీతారాములు అనే వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపిన ఘటన మండలం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది.నాలి సీతారాములు భార్య నాలి జానకి 26వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినఏడేళ్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ బుర్ర రాజగోపాల్ ,కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ , తమ సిబ్బందితో కలిసి మడ్డర్ కేసును ఎంతో చాకచక్యంగా చేధించారు ఈ సందర్భంగా గా సి ఐ రాజగోపాల్ మాట్లాడుతూ...బుధవారం తమ సిబ్బందితో గ్రామాల్లో విచారిస్తుండగా కొత్తగూడెం క్రాస్ వద్ద పొలాల్లో అనుమానితులుగా దాక్కొని ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు తమ తప్పుని ఒప్పుకున్నారని వారన్నారు ,భూతగాదాలు మంత్రాల చేస్తుండు అనే నెపంతో గొడ్డలితో నరికి చంపిన మని వారు తెలిపారు నిందితుల వివరాలు తొలెం వెంకటేశ్వర్లు (55 సంవత్సరాలు) ఇర్ఫ వారి గుంపు, తోలెం ప్రవీణ్(25).తోలేం రామనాథం (26), కొమరం కృష్ణమూర్తి (25), ఒక మైనర్ బాలుడు అందరూ కొమరం వారి గుంపు వారు వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మైనర్ బాలుని అబ్జర్వేషన్ హోమ్ వరంగల్ తరలించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా సీఐ రాజగోపాల్ మర్డర్ కేసు చేధించిన కరకగూడెంఎస్ ఐ జీ, ప్రవీణ్ కుమార్,పోలీసు సిబ్బందిని అభినందించారు.
Post A Comment: