CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధుతో వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గుతుంది.రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి.

Share it:



 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంతో వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గుతుందని రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రైతు వేదిక నందు జరిగిన రైతుబంధు ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు పెట్టుబడులకు భారంగా మారిన రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో కెసిఆర్ కు కలగటం మంచి ఆలోచన అని,కెసిఆర్ ఆలోచన అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులను, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డిలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏవో నవీన్ బాబు, ఎంపీపీ బానోత్ పార్వతి,గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకట్ నారాయణ, మండల కో ఆర్డినేటర్ లింగయ్య, సర్పంచులు మల్లిపెద్ది లక్ష్మీ భవాని, పూసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ దారా బాబు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ నాయకులు మాలోత్ బోజ్యనాయక్, సారేపల్లి శేఖర్, భూపతి రమేష్, సత్తి నాగేశ్వరరావు, చిన్న పిచ్చయ్య, రమేష్, భానోతు రాముడు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: