మన్యం టివి న్యూస్ దమ్మపేట జనవరి 10 ;-
మల్కారం గ్రామం లో రైతు బంధు సంబరాల్లో మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.ఈ సందర్భంగా రైతు బంధు గురించి మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రసంగించిన అనంతరం పామాయిల్ సాగు చేసే రైతులను శాలువా కప్పి సన్మానించారు ఎమ్మెల్యే .ఈ కార్యక్రమం చివరన కొంతమంది వారి సమస్యలపై వినతి పత్రం అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: