మన్యం టీవి వెబ్ డెస్క్:
పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూర్ గ్రామ పంచాయితీ లో గురువారం సర్పంచ్ వాసం రుద్ర అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు
గద్దల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును మండలంలో వేగం పెంచాలని బూత్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు రూ.2 లక్షల ఉచితంగా ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు.
బూతు స్థాయి ఏజెంట్లు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కలుస్తూ సభ్యత్వం నమోదు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రయోజనాలను తెలియజేయాలని సూచించారు.
మండలంలోని సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని కోరారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర చౌదరి, మండల సభ్యత్వం ఇంచార్జ్ రాములు నాయక్, మంగయ్య, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: