మన్యం మనుగడ, పినపాక:
శ్రీ రామానుజ సహస్రాబ్దీ సమారోహం జీవ ప్రాంగణము జరుపుటకు 2/2/2022 నుండి 14/02/2022 వరకు శ్రీరామనగరం శంషాబాద్ హైదరాబాద్ లో జరగబోయే కార్యక్రమాల గురించి కావేరి సీడ్స్ వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీ వనజ భాస్కరరావు, కావేరీ సీడ్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ రావు ఆదేశాల మేరకు జిల్లా భద్రాదికొతగూడెం పినపాక మండలం టి. కొత్తగూడెం గ్రామంలో కరపత్రాలు పంచుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్ పి టి సి దాట్ల సుభద్రదేవి వాసుబాబు , గ్రామ సర్పంచ్ కనీతి చిన్నక్క, ఉపసర్పంచ్ ఇనుగుర్తి శ్రీమతి నాగలక్మి రెడ్డి, కావేరి సీడ్స్ అసిస్టెంట్ మేనేజర్ సంపత్ , ఆర్గనైజర్ దాట్ల శ్రీని వాసరాజుగారు (గోపి) ఆధ్వర్యంలో పూజల గురించి వివరిస్తూ శ్రీ రామానుజ సహస్రాబ్దీ సమరోహం
1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహా క్రతువు
108 దివ్యదేశ ప్రతిష్ఠ కుంభాభిషేకం స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: