మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లోని చిట్టితల్లి సేవాసమితి ఆద్వర్యంలో కరోనా కారణముగా కరోనా పై అవగాహన కోసం మాస్క్ తప్పనిసరిగా పాటించాలని కరోనా నిబంధనలు పాటించాలి అని ప్రచారం కొరకు నియమించిన ప్రచార రథాన్ని సోమవారము నాడు ప్రభుత్వా హాస్పిటల్ లో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నంసెట్టి వరలక్ష్మిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్టం రమ్య, సంపూర్ణ, సెక్రటరీ ఫణీంద్ర, నారాయణపురం రైతు సమన్వయ కమిటీ మెంబర్ చిన్నాంసెట్టీ నరసింహం, తెరాస పార్టి నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: