మన్యం మనుగడ దుమ్మగూడెం::
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలో లచ్చిగూడెం దగ్గర మండల మహిళా కార్యదర్శి మడకం భారతి నిర్వహణలో బాలమేళ జరిగింది. ఈ కార్యక్రమంలో గోవిందపురం, ములకనపల్లి కాలనీ, ములకనపల్లి, మంగవాయి బాడవ, గద్దమడుగు, వర్ష వారి గుంపు పాఠశాలల నుంచి మొత్తం 42 మంది విద్యార్థులు వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నేర్పించే ప్రార్ధన శ్లోకాలు, అభినయ, గేయాలు, పద్యాలు, పాటలు, ఆటలు ప్రాంత సంఘటన మంత్రి సువిర్ జి , ప్రాంతం యువ ఆయాం ప్రముఖ సత్యనారాయణ ,ప్రాంత కార్యకారిని బంధ స్వరూప రాణి ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు రేలానృత్యం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రముఖ పెద్దాడ ఆశాలత , జిల్లా సంఘటన మంత్రి కోరం సూర్యనారాయణ , జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గోనె లక్ష్మీనారాయణ, చర్ల కొమురం భీం విద్యార్థి నిలయం ఉపాధ్యక్షులు శ తాటి పాపారావు , ప్రఖండ ప్రముఖ సున్నంరాజేష్, మండల ప్రముఖులు నూపారాధ, ముర్రం లక్ష్మీ నరసింహ, ఎకోపాధ్యాయులు తెల్లం ధనలక్ష్మి, జలకం జయ దుమ్ముగూడెం మండల కమిటీ ఉపాధ్యక్షులు సోయం. ధర్మరాజు, క్రీడా ప్రముఖ వాసం ముత్యాలరావు కార్యకర్తలు మొత్తం 93 మంది పాల్గొన్నారు.
Post A Comment: