ములకలపల్లి:జనవరి29:
(మన్యం మనుగడ )న్యూస్:
మండలం లోని సాకివాగు ఘటనలో మహిళలు, బాలికలపై దాడి చేసిన గుండాలపాడు బిట్ ఆఫీసర్ మహేష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, పొక్సో యాక్ట్ ప్రకారం ఎఫ్.ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండల కేంద్రం లో భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం స్థానిక అటవీ క్షేత్రాధికారి కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ముట్టడించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఆదివాసీ మహిళలు బాలికలపై దాడి జరిగి 10 రోజులు కావస్తున్నా ఫారెస్ట్ , పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఘటన పై కనీసం విచారణ కూడా చేయలేదని,ఇప్పటికైనా దాడికి పాల్పడిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేష్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోని వెంటనే విధుల నుంచి తొలగించాలని , అతనిపై పొక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి,గాయపడిన మహిళలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ములకలపల్లి పారెస్ట్ రేంజర్ ఆఫీసులో మరియు స్థానిక పోలీస్ స్టేషన్ నందు వినతిపత్రాన్ని ఆదజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, జిల్లా నాయకులు నూపా భాస్కర్, కల్లూరి కిషోర్, పోతుగంటి లక్ష్మణ్, డివిజన్ నాయకులు కుంజా కృష్ణ,కల్లూరి పద్మ,ఎంపిటిసి లు మడకం విజయ,నూపా సరోజని, రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి, పాత గుండాలపాడు సర్పంచ్ కారం కుమారి,యర్రగొర్ల రామారావు,వంకా సురేష్
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: