మన్యం మనుగడ, మణుగూరు:ఆదివాసీల సమస్య లను ముఖ్యమంత్రి కి విన్నవిస్తా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం
ఆదిలాబాద్ నుండి వచ్చిన ఆదివాసీకుల పెద్దలు మడవి రాజు, అడ్వకేట్ పెందుర్ ప్రభాకర్, Dr.మంగం విశంబాబు లు ఆయనను క్యాంపు ఆఫీసులో కలిసి ఆదివాసీ జాతి ఎదురుకుంటున్న అనేక సమస్యలపై విన్నవించారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం లో ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొంటున్నాఅనేక సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకొనుటకు ఆదివాసీ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి సమస్యలు నివేదిదాం అని రేగా వారికి సూచించారు.
Post A Comment: