CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములకలపల్లి అమానుష సంఘటపై ప్రభుత్వం స్పందించాలి

Share it:



  • అడవి బిడ్డకు అడవులకు వెళ్లే అర్హత లేదా..?
  • ఘటనపై సమగ విచారణ జరిపించాలి
  • ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా

మన్యం న్యూస్ వెబ్ డెస్క్:

పాల్వంచ: ములకలపల్లి మండల పరిధిలోని సాకివలస గ్రామంలో ముగ్గురు మహిళలపై ఫారెస్టు అధికారి, సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని, ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి భాద్యులపై కఠిణ చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి 

ఎస్ కె, ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. సాకివలస ఆదివాసీ గిరిజనులపై జరిగిన హేయమైన సంఘటనపై స్పందింస్తూ సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రాణ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాజుల పరిపాలనలాగా మారిందని అడవులపై ఆదివాసీ గిరిజనులపై పూర్తి హక్కు ఉందని అటవీ హక్కుల చట్టం 2005 చెపుతున్నా ఈ చట్టానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. అడవులే జీవనాదారంగా జీవిస్తున్న గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే విదంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అటవీ అధికారులను, పోలీసులను ఉసిగొల్పుతూ దాడులకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. సాకివలస గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు పెట్టి లక్ష్మి, సోడె దేవమ్మ, సోడె రజనీలో కట్లెపుల్లలకోసం అడవిలోకి వెల్లడం వారు చేసిన పాపమా అని ప్రశ్నించారు. గిరిజనులు అడవులను తమ జీవనాదారంగా భావిస్తారేగాని వాటిని నాశనం చేసే ఉద్దేశం ఉండదన్నారు. స్మగ్లర్లు, భూస్వాములకు పరోక్షంగా సహకిస్తూ అమాయ గిరిజనులపై తమ ప్రతాపం చూపడం అటవీ అధికారులకు తగదన్నారు. ఈ ఘటనపై సంగ్ర విచారణ జరిపించి బాదితులకు న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సృజన్, వాజిద్ ,రాము,షకీర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: