మనం టీవీ కరకగూడెం: 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పరిధిలోని రేగుళ్ళ గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం నందు అంగన్వాడి టీచర్ జాతీయ జెండాను అవమాన పరిచే ఈ విధంగా జెండాను తిరుగల ఎగరవేశారు. దీన్ని చూసిన గ్రామస్తులు ప్రజలు ఆశ్చర్యపోయారు. జాతీయ జెండాను ఈ విధంగా ఎగరవేసిన అంగన్వాడి టీచర్ పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన ఒక టీచర్ ఇలాగా జాతీయ జెండాలను తలకిందులు ఎగర వేస్తే విద్యార్థులకు విద్యాబుద్ధులు ఎలా నేర్పుతున్నారు దీనికి నిలువెత్తు నిదర్శనమని గ్రామస్తులు తెలిపారు .
Post A Comment: