మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన దళిత సంక్షేమ సంఘం నాయకులు, పాల్వంచ లో జనవరి మూడవ తారీకున జరిగినటువంటి సంఘటన పై, నిందితుడు వనమా రాఘవ పై రౌడీషీట్లు మరియు పిడియాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని, దళిత సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా అశ్వారావుపేట ప్రెస్ నోట్ కార్యక్రమంలొ పాల్గొన్న దళిత సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి కృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్దెల అప్పారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల చిన్ని, రాష్ట్ర స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి, పోలిక పోగు ధర్మరాజు,భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గొల్లమందల పెంటయ్య, ఎస్సీ పరిరక్షణసమితి గిద్ద కొండయ్య, తదితరులు మాట్లాడుతూ, ఇటువంటి హే య కరమైన సంఘటనలు పునరావృతం కాకుండా, పోలీసు వ్యవస్థ కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Post A Comment: