CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధు పథకంతో రైతులు ఆర్థిక సుస్థిరత సాధిస్తున్నారు.జిల్లా రైతు బంధువు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి...

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా 2018 నుండి అమలు చేస్తున్న రైతు బంధు పథకంతో రైతులు క్రమంగా ఆర్థికంగా సుస్థిరత సాధిస్తున్నారని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రైతు వేదిక నందు జరిగిన రైతులు, రైతుబంధు సమితి బాధ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు రైతుబంధు ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 5న రైతు వేదికను అలంకరించడం,6న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 7న ముగ్గుల పోటీలు, 8న ఉత్తమ రైతులకు సన్మానం, 9న వ్యవసాయ కార్యాలయాలు, గోదాముల వద్ద ఉత్సవాలు, 10న మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, రైతు సమితి బాధ్యులుపాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏవో నవీన్ బాబు, ఎంపీపీ భానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ,జెడ్ పి టి సి కొణకొండ్ల వెంకట్ రెడ్డి, సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీభవాని, ఎంపీటీసీ దారా బాబు, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, మండల టిఆర్ఎస్ నాయకులు ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ బోజ్య నాయక్, జడ వెంకయ్య, రమేష్, చిన్న పిచ్చయ్య, నాగరాజు, సూర వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: