మన్యం టీవీ వెబ్ డెస్క్:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాన ఆలయాన్ని సందర్శించారు.మరో రెండు నెలల్లో పునఃప్రారంభం కాబోతున్న యాదాద్రి ఆలయం. సీఎం కేసీఆర్ దృఢసంకల్పానికి నిదర్శనమన్నారు.ప్రజల అభివృద్ధి,సంక్షేమం కోసం మరింత పట్టుదలతో పనిచేసేలా,సీఎం కేసీఆర్కు శక్తినివ్వాలని,స్వామివారిని ప్రార్థించానని తెలిపారు.విమాన గోపురానికి విరాళాల సేకరణ జరుగుతోందని,తాను కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని,పురస్కరించుకొని విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తులాల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు.
Post A Comment: