మన్యం టీవీ కరకగూడెం: టిఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్( వాసు) తండ్రి రావుల ఎల్లయ్య గౌడ్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా వారి దశ దినకర్మ లకు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమానికి పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు ,తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ముద్దం కృష్ణ, బొలిశెట్టి నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: