మన్యం మనుగడ మంగపేట.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మానవ సేవ యూత్ ఉపాధ్యక్షుడు యర్రా శ్రావణ్ కుమార్ మండలం లోని చుంచుపల్లి లో కస్తూరిభా ఆశ్రమ పాఠశాల బాలికలకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా యర్రా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారత దేశానికి తొలి మహిళ ఉపాధ్యాయురాలు, అసమానతలతో కూడుకున్న సమాజంలో
స్త్రీ విద్య , స్త్రీ సాధికారత కోసం..
సమాజాన్ని ఎదిరించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని అలుపెరగని పోరాటం చేసి స్త్రీవిద్య కోసం , స్త్రీ సమానత్వ హక్కు కోసం పోరాటం చేసిన, చదువులతల్లి సావిత్రిబాయి పూలే అన్నారు. సావిత్రి బాయి పూలే ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను సాధించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మానవ సేవ యూత్ అధ్యక్షులు కర్రీ రామ్మోహన్, మానవ సేవా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: