CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా రైతు బంధు పథకం.కేసిఆర్ చిత్ర పటానికి పాల అభిషేకం చేసిన ఎంఎల్ ఎ మెచ్చ నాగేశ్వరరావు

Share it:

 




ములకలపల్లి:మన్యం మనుగడ:(న్యూస్):మండలం లోని దుంప సాంబశివరావు మరియు పూసు గూడెం గ్రామ పంచాయితీ ఒడ్డు రామావరం తాటి చిరంజీవి ఇటీవలే మరణించడంతో వారూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం తో,టి ఆర్ ఎస్ పార్టీ తరుపున 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను కుటుంబ సభ్యులకు వారి నివాసం లో అందజేసారు. ములకలపల్లి మెయిన్ సెంటర్ లో రైతుబంధు సంబరాల లో భాగం గా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.అనంతరం ఎం ఎల్ ఏ మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ టి ఆర్ ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య నా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తానని,ఆయన మాట ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, రైతు సమన్వయ అధ్యక్షుడు నాగళ్ళ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, ములకలపల్లి ఎంపీటీసీ మెహరమణి,పుష్పాల చందర్రావు, పామర్తి వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి శనగపాటి అంజి, సీతారాంపురం సర్పంచ్ సున్నం సుశీల,శనగపాటి సీతారాములు, ముదిగొండ గోపి,సురభి రాజేష్ ,గాదె వెంకటేష్, తాటి ప్రవీణ్,గుంటూరు కృష్ణ,హరి, కామేష్, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: