గుండాల జనవరి 26 (మన్యం మనుగడ) టపాసులతో మార్మోగిన మండల కేంద్రం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో మండలంలో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్ ఆధ్వర్యంలో టపాసులను తేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిలుపుతరని అన్నారు. మండలంలో టిఆర్ఎస్ పార్టీ బలం పెద్ద ఎత్తున పెరిగిందని ఎన్నికలు ఏవైనా టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. రేగా కాంతారావు తో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. రేగాను అధ్యక్షుడుగా నియమించిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , యువజన విభాగం అధ్యక్షులు అజ్జు , అధికార ప్రతినిధి రాము, సర్పంచులు సమ్మయ్య , అజ్మీరా మోహన్, జనగం నరసింహారావు, అబ్దుల్ నబి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, సుభాని, లక్ష్మీనారాయణ, గడ్డం రమేష్ , జాడి ప్రభాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: