మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెం గ్రామానికి చెందిన సాక్షి పత్రికా విలేకరి సునార్కని మల్లేష్ కుమార్తె 8 సంవత్సరాల చిన్నారి అమూల్యకు ఇటీవల ప్రమాదవశాత్తు చలి మంటలు అంటుకొని 28 శాతం శరీరం దగ్ధమై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తుండగా మంగళవారం సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ తమ పౌండేషన్ సభ్యులతో కలిసి పరామ ర్శించారు.ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని,మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు.తక్షణ ఆరోగ్య ఖర్చులకు దాతల ద్వారా సేకరించిన 8 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.దాతలు గొప్ప మనస్సుతో స్పందించి చిన్నారికి అమూల్య వైద్య ఖర్చులకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమతా ఫౌండేషన్ సభ్యులు దుర్గం విశ్వనాధ్,ముడి మడుగుల సురేష్,కొత్తపల్లి సందీప్,ఏల్పుల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: