మన్యం టీవీ కరకగూడెం: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు గైర్హాజరయ్యే జాతీయ జెండాను ఎగురవేయడానికి కూడా రాణి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మండల పరిధిలోని రేగుల గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణతంత్ర దినోత్సవం రోజు కూడా జాతీయ జెండా ఎగరవేయడానికి రాలేదు అంటే ఆయన విద్యార్థులకు ఏ విధమైన విద్యను అభ్యసిస్తున్నారు దీనికి నిలువెత్తు నిదర్శనం. టీచర్ రాక కోసం చిన్నపిల్లలు ఎదురు చూడడం గ్రామస్తులు ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించి పాఠశాల చైర్మన్, స్థానిక సర్పంచ్, అంగన్వాడి టీచర్ ను గ్రామస్తులు అడగగా మాకేం తెలియదు అని సమాధానం ఇవ్వడంతో చేసేది ఏమి లేక గ్రామస్తులు పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేసి వారి ఇళ్లకు పంపించారు. ఇటువంటి ఉపాధ్యాయులపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
Post A Comment: