మన్యం మనుగడ వెబ్ డెస్క్:
పాల్వంచ కు చెందిన రామకృష్ణ కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి కారణమైన ప్రధాప్రచురుణార్థంన నిందితుడు వనమా రాఘవ ను కాపాడేందుకు A2 నిందితుడిగా ప్రకటించడం సిగ్గుచేటు అని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వి PYL-POW రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజయ్,యదళ్ళపల్లి సావిత్రి అన్నారు. ఈరోజు ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద PDSU-PYL -POWప్రజాసంఘాల ఆధ్వర్యంలో వనమా రాఘవ నీ కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ప్లే కార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి వనమా వెంకటేశ్వరరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని గతం నుండి విచ్చలవిడి నేరాలకు ప్రధాన నిందితుడిగా ఉన్న కీచకుడు రాఘవ ప్రభుత్వాల అండదండలతోనే నేరాల నుండి రక్షించ పడుతున్నారని దీంతో మరింత అధికార అహంతో మహిళలపై లైంగిక వేధింపులు,భూదందాలు సెటిల్ మెంట్లు చేస్తూ అవినీతి సామ్రాజ్యంతో తన నేర జాబితా పెరిగిపోతుందని అందులో భాగంగానే రామకృష్ణ కుటుంబం మొత్తం మరణానికి కారకుడయ్యాడు అని వారు అన్నారు.రామకృష్ణ మరణిస్తూ తన మరణానికి వనమా రాఘవనే ప్రధాన కారణమని డయింగ్ డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ నేడు ప్రభుత్వం పోలీసులు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే A2 నిందితుడిగా ప్రకటించారని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. ప్రభుత్వ అండదండలతో మహిళలపై వేధింపులు అత్యాచారాలకు పాల్పడిన డబ్బున్న బడాబాబులు నేరస్తులుగా శిక్షించ బడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాఘవను రక్షించే చర్యలు మానుకొని ప్రధాన నిందితుడు A1గా ప్రకటించి యావజ్జీవ కారాగారశిక్ష వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో PDSU నాయకులు నరేందర్, ఎ పార్థు, రవీనా, సాయి, తరుణ్, PYL నాయకులు కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: