- మృతుని కుటుంబానికి 10 వేలు వితరణ అందజేసిన తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
- రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆర్దిక సహాయం
మన్యం మనుగడ, పినపాక :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు దైర్యం చెప్పారు. బుధవారం ఏడూళ్లబయ్యారం లో విస్తృతంగా పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించారు. పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుంజా శ్రీను కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. అదేవిధంగా గాయాలపాలైన కొర్సా భద్రం, బొగ్గం పెద వెంకటయ్య, మేకల సమ్మయ్య, సోయం బక్కయ్య, మేకల సత్యంలను పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయాలపాలైన వారికి రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున ఒక్కొక్కరికి 5 వేలు ప్రకటించారు. అదే విధంగా మృతిచెందిన కుంజా శ్రీను కుటుంబానికి 10 వేలు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: