CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జీ ఓ. నంబర్ 317 వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం : ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్.

Share it:



మన్యం మనుగడ వాజేడు. ఈరోజు ది .06- 01- 2022 న.ఎం పి పి ఎస్ అరుణాచల పురంలో ఏ టి ఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పేరే జానకరావు. మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జి ఓ. నెంబర్ 317 అమలు చేయడం రాజ్యంగా విరుద్ధం అని అన్నారు. ఈ జీ. ఓ. ఈ ప్రాంత నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల ఉపాధ్యాయుల కేటాయింపు వల్ల సీనియర్ ఉద్యోగులు ఎక్కువగా పట్టణ ప్రాంతానికి జూనియర్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎక్కువగా స్థానికేతర ఏజెన్సీ జిల్లాలోకి కేటాయించడం వల్ల ఏజెన్సీ ప్రాంతం స్థానికేతర జూనియర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నిండిపోతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో జూనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులు బయట జిల్లాల నుండి ఎక్కువగా రావడం వల్ల స్థానిక ఏజెన్సీ జిల్లాల నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతుంది. మరో 20 సంవత్సరముల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిఓ ఫై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బోదె బోయిన జయందర్ రావు ఎ టి ఎఫ్ వాజేడు మండల అధ్యక్షులు ఉండం రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి చట్టం సాగర్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: