మన్యం మనుగడ వాజేడు. ఈరోజు వాజేడు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్ ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారు. అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి దీక్షకు కూర్చోని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కందుల రామ్ కిషోర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన జీఓ 317 ను తక్షణమే రద్దుచేసి స్థానికత ఆధారంగా ఉద్యోగాలు నియమించాలని లేదంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ఆ పార్టీ మండల అధ్యక్షులు రామ్ కిషోర్ అన్నారు . తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క ప్రతీ చర్యలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తగిన రీతిలో బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బండి సంజయ్ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా సభ్యులు యాలం సుబ్బయ్య, మండల ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రవీందర్, ఉపాధ్యక్షుడు రేపాకుల శివ మరియు లొట్టపెట్టల నాగరాజు, యువమోర్చా అధ్యక్షులు పెద్ది జగపతిబాబు, కిసాన్ మోర్చా నవీన్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: