మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం
గుండాల మండలం కు చెందిన కల్తీ భవాని MBBS లో సీట్ రావడంతో ఆమె చదువుకు అయ్యే ఖర్చు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భరిస్తామని విప్ రేగా కాంతారావు గతంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ ఖర్చుల కొరకు రూ,13,000/-ఆర్థిక సహయంను రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ద్వారా శుక్రవారం మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆ విద్యార్ధి కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కల్తీ భవాని బంగారు భవిష్యత్తు కు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తానని అన్నారు.
Post A Comment: