మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 14వ ఏడాది జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన యూసఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నీ లో భాగంగా ఆదివారం మండల కేంద్రంకి చెందిన బబ్బు లెవన్ జట్టుకు బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని టీ షర్ట్లు ను అట్టి జట్టు క్రీడాకారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గోనెల నాని తో పాటు తోకల సతీష్ పాల్గొని టీ షర్ట్ లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంని ఉద్దేశించి గోనెల నాని మాట్లాడుతూ ముందుగా యువత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని,క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని,చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని,క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని పట్టుదలతో ఆడి ఫైనల్స్ కు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి,బబ్బు రాయుడు,కార్తిక్,వెంకీ,సింగు,హరీష్,నాగరాజు,కోటి,పవన్,ప్రసాద్,నగేష్ వారి స్నేహ బృందం పాల్గొన్నారు.
Post A Comment: