CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోడ్డు ప్రమాద భాధితులకు రేగా కాంతారావు భరోసా.మృతుని కుటుంబానికి 10 వేలు, క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.5 వేలు వితరణ.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక : 


ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన భాధితులకు తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అండగా నిలిచారు. గతకొన్ని రోజుల క్రితం ములుగు జిల్లా పస్రా వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, ప్రమాదంలో పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామపంచాయితీ పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు. 

మృతుడు - 

కుంజా శ్రీను కుటుంబానికి రూ.10 వేలు, 

క్షతగాత్రులు - 

మడకం వెంకటేశ్వర్లు- 5000

మేకల సమ్మయ్య- 5000

మేకల సత్యం- 5000

సోయం బక్కయ్య- 5000

కొర్సా భద్రం- 5000 

బొగ్గం పెద వెంకటయ్య- 5000లకు రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం శనివారం బాధితులకు ఆర్దిక సహాయం అందించారు. 


ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, సర్పంచ్‌ కోరం రజిని, కో ఆప్షన్ జహంగీర్, మండల నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, బూర రమేష్‌, పాపాల వీరబాబు వార్డు మెంబర్ వాగుబోయిన వసంత, కుంజా కృష్ణ , బొగ్గం రమేష్‌ , తునికి రామారావు, కొర్సా రమణ, వాగబోయిన ఆదిలక్ష్మి, కోరం జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: