CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రికెట్ లీగ్ సీజన్-1 లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్న పెంట్లం కేజిఎం క్రికెట్ జట్టు.

Share it:

 


మన్యం మనుగడ:ములకలపల్లి:(అన్నపురెడ్డిపల్లి):మండలం లోని, పెంట్లం గ్రామ కేజియం క్రికెట్ జట్టు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.పెంట్లం గ్రామస్తుడైన సోయం రాంబాబు ( మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్-లక్ష్మీదేవిపల్లి ) ప్రోత్సాహంతో కేజిఎమ్ క్రికెట్ టీం.సత్తుపల్లి మండలం, యాతాలకుంట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ సీజన్-1 క్రికెట్ క్రీడలో మెళుకువలు ప్రదర్శిస్తూ, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ద్వితీయ స్థానాన్ని పొంది, ద్వితీయ బహుమతి అయిన ఆరు వేల రూపాయలను మరియు మెమొంటోలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడా ప్రియులు, పెంట్లం గ్రామ పెద్దలు కంచు రామకృష్ణ ( డాక్టర్ ),సోయం రమేష్ ( ఏఎస్ఐ ), మాట్లాడుతూ యువత విద్యతో పాటు, క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలని. క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసంగా మరియు ఆరోగ్యంగా ఉంటారని. క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కోర్సా నాగరాజు, కోట కిరణ్,కుర్సం అర్జున్, తాటి శివ, గడ్డం శివ, మడకం సంపత్, తాటి నాగరాజు, కోర్సా మల్లేష్, భూపతి నాగరాజు (కానిస్టేబుల్), తదితర క్రీడాకారులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: