మన్యం మనుగడ వెబ్ డెస్క్:
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఇర్ప పగడన్న ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకుపోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాయిని రాజు,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొమరారం ఏరియా కమిటీ కార్యదర్శి ఈసం భద్రన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు అజ్మీర బిచ్చ అన్నారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కొమరారం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పగడన్న ను స్మరిస్తూ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సువర్ణ పాక ధర్మన్న అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ పగడన్న ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో తనపై నిత్య నిర్బంధాలు ప్రయోగించినప్పటికీ అదరకుండా,బెదరకుండా ఉద్యమాలలో మరింత భాగస్వామ్యం అవుతూ తన జీవితం ప్రజలకు అర్పించాడని చివరి శ్వాస వరకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాజకీయాల వెలుగులో ఎర్రజెండాను వదలకుండా ఎటువంటి స్వార్థం ప్రయోజనాలకు అవకాశం ఇవ్వకుండా నమ్మిన సిద్ధాంతం వెలుగులో పనిచేసిన పగడన్న మార్గం మనకు ఆదర్శమని వారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తునికాకు రేట్ల పెంపు కై పోడు భూములు కొట్టించి ప్రజలకు సాధించి పెట్టడంలో తన పాత్ర కీలకంగా ఉందని వారు అన్నారు. ప్రజల మధ్య తరచు వచ్చే వైరుధ్యాలను మార్క్సిజం వెలుగులో పరిష్కరించే మంచి నైపుణ్యం కలిగిన పగడన్న నేడు మన మధ్య లేకపోవడం విచారకరమని ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులర్పించడం అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముడిగ బుచ్చి రాములు కాంపాటి ప్రసాద్ బుర్ర రాఘవులు చొప్పదండి రాములు,తనకం సత్యం కోరం ముత్తక్క ,సమ్మయ్య కోటేశ్,చిన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: