మన్యం మనుగడ, డెస్క్:
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఒక మహోన్నత కార్యానికి పూనుకొన్నారు. రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యతో బాధపడేవారికి శస్త్రచికిత్సలు చేయడానికి పూనుకున్నారు. డిసెంబర్ 29వ తేదీన మణుగూరు లోని వంద పడకల ఆసుపత్రిలో హైదరాబాదు వైద్యులచే కంటి సమస్యతో బాధపడేవారికి పరీక్షలు చీకటి బతుకుల్లో వెలుగులు నింపనున్న కాంతన్న
నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం ఎవరికైతే కంటికి సంబంధించి శస్త్రచికిత్స అవసరం ఉన్నదో వారిని మెగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో హైదరాబాద్ తరలించి, శస్త్ర చికిత్స చేయించి, తిరిగి వారిని ఇంటి వద్దకు తరలించే బాధ్యత తనదేనని రేగా కాంతారావు తెలియజేశారు. ఈ అవకాశాన్ని పినపాక నియోజకవర్గం లోని ప్రజానీకం సద్వినియోగ పరుచుకోవాలి అని, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలియజేశారు. ఈ విధంగా చీకటి బతుకుల్లో వెలుగులు నింప బోతున్న రేగా కాంతారావు గురించి నియోజకవర్గంలోని ప్రజానీకం చర్చించుకుంటున్నారు.
Post A Comment: