CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కిష్టాపురం పంచాయితీలో సమస్యలు తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు.ఎమ్మెల్యే కి తెలియజేసి, త్వరలోనే పరిష్కారం చూపుతామని వెల్లడి ..

Share it:

 





మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని కిష్టాపురం పంచాయతీని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తో పాటుగా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు గ్రామ- గ్రామానికి టిఆర్ఎస్ పర్యటనలో భాగంగా వెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో నెలకొన్న బిటి రోడ్లు, సిసి రోడ్లకు సంబంధించి త్వరలోనే పరిష్కారం జరుగుతుందని, కొంత మేర నీటి సమస్య ఉండడంతో, ఆ సమస్యను పరిష్కరిస్తామని, తెలియజేయడం జరిగింది. గ్రామంలో సిసి రోడ్ ఏర్పాటుకు, ఆటంకం కలిగించే విద్యుత్తు స్తంభం పరిష్కారం గురించి, విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇటీవల ఆటో ప్రమాదంలో గాయాలపాలైన మొగిలిపల్లి భిక్షం ను పరామర్శించి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులను ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం అంగన్వాడి సెంటర్ లో గల విద్యార్థులకు ఎంపిపి గుమ్మడి గాంధీ చేతుల మీదుగా టిఆర్ఎస్ నాయకులతో కలిసి తినుబండారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచు సుతారి సుశీల, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, ఇతర టిఆర్ఎస్ నాయకులు, కిష్టాపురం పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: