CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు నిధులను విడుదల చేయడంతో రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,ములుగు టౌన్ అధ్యక్షులు చెన్న విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్త్రీ- శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్ ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి (పాలాభిషేకం) క్షిరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ ఎన్నుదన్నుగా ఉంటుందని అన్నారు.యాసంగి రైతు బంధు నిధులు విడుదల చేసిన శుభ సందర్భంగా గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెరాస  ప్రభుత్వం ప్రవేపె డుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడంలో వారధిగా వుంటూ,పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.అనంతరం ములుగు టౌన్ అధ్యక్షులు చెన్న విజయ్ ను శాలువాతో సన్మానించారు.ఈ కార్య క్రమంలో ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,ములుగు జడ్పీటీసీ సకినాల భవాని,ఒడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకుడు గోవింద్ నాయక్,రైతు బంధు మండల అధ్యక్షులు,కె.కుటుంబరావు, మైనార్టీ నాయకుడు తాహెర్ పాషా,జిల్లానాయకులు,మండల నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: