- ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం.
మన్యం మనుగడ, కరకగూడెం:
పేదలకు సేవ చేయాలని గుణం కలిగి ఉండటం గొప్ప లక్షణమని ఏడూళ్ళ బయ్యారం సీఐ రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన బుధవారం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో మండలంలోని నిలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామంలోని యువతకు నిర్వహించిన టీషర్ట్స్,లోయర్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు సేవలు చేయడం గొప్ప పుణ్యకార్యంగా అభివర్ణించారు. అలాగే సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు.ఏటా ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 2022ఏడాదిలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ.. నిరు పేదలకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.గ్రామంలోని సుమారు 20 మంది యువతకు క్రీడా దుస్తులు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్,పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: