ములకలపల్లి:డిసంబర్31:.మన్యం మనుగడ(న్యూస్):
పోడు దరఖాస్తులను సత్వరమే పరిశీలించి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని' ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ'నేటి వరకు సాగులో ఉన్న పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ లబ్ధిదారుల ఇంటి స్ధలంలో 5 లక్షల తో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రన్ని అప్పుల బొందగా మారుస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు 3000 రూపాయిలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న పోడుకు హక్కు కల్పిస్తామని దరఖాస్తులు తీసుకుని నెలలు గడుస్తున్నా కనీసం పరిశీలన కూడా చేయలేదని దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం సాగుదారులను మోసంచేసేలా కనిపిస్తుందని ,ప్రజల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.వెంటనే దరఖాస్తు లు పరిశీలించి సాగులో ఉన్న ప్రతిఒక్కరికీ హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,నాయకులు ఆదినారాయణ, నిమ్మల మదు,నాగేశ్వరరావు, రాంమూర్తి , పొడియం వెంకటేశ్వర్లు,లక్ష్మీ నర్సయ్య, రాంబాబు, అమల ,వీరస్వామి, సారయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: