మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవాళ్ళ గూడెం గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని కలిసి వారికి త్రి పేస్ కరెంటు సదుపాయము కావాలని సమస్యను ధరించారు .ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విద్యుత్ శాఖ అధికారులతో చరవాణిలో మాట్లాడి ఆ సమస్యను మార్చిలోపు పూర్తి చేస్తామని అధికారులు తెలపడంలో అ విషయాన్ని రైతులకు ఇవరించారు .ఈ కార్యక్రమంలో అళ్లపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాద్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు, గుండాల మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి అజ్జు కొమరం సత్తిష్ రైతులు పాల్గొన్నారు.
Post A Comment: