మన్యం టీవీ చర్ల:
(గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ) ఖమ్మం వారిచే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల, పరిధిలోగల సింగసముద్రం గ్రామం నందు 110మంది నిరుపేద విద్యార్థులకు స్థానిక మండల ఎఫ్ ఎస్ ఓ అచ్చ చేతుల మీదగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు చైల్డ్ కేర్ సెంటర్ ను స్థాపించి వారికి సహాయం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఇంకా అనేక గ్రామాల, పేద విద్యార్థులను గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయాలని సూచించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపకులని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ఎస్ఓ అచ్చ సంస్థ ప్రతినిధులు మురళి రెడ్డి, యన్. రమేష్ జె. అశోక్, చైల్డ్ కేర్ సెంటర్ ఇన్ చార్జ్ సోలోమోను, రాజేశ్వరి సీనియర్ పాత్రికేయులు దొడ్డా ప్రభుదాస్ పాల్గొన్నారు.
Post A Comment: