ములకలపల్లి:డిసెంబర్1:
(మాన్యం మనుగడ):వరి ధాన్యం కొనుగోలు తక్షణమే ప్రారంబించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కమిటీ ఆధ్వంర్యంలో తహాశీల్దార్ కి వినతి పత్రం అంద జేయాడం జరిగింది.ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్ మాట్లాడుతూ కల్లాలో ఉన్న వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని,కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం జీవితాలతో ఆడుకోవద్దని, ధాన్యం కల్లాల లోనే తడిసి మొక్కలు వస్తున్నాయి దానికి ప్రభుత్వమే కారణమని,రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసారు.పండించిన వరి ధాన్యం అమ్మకం రైతాంగం కు తీవ్ర సమస్యగా అయిందని,అదేవిదంగా యాసంగి పంటకు సంబందించి రైతాంగానికి విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు రైతులకు సబ్సిడిపై అందించి,ప్రభుత్వమే రైతుల వద్దనుండి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని,కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని,విధ్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేసారు.ఈకార్యక్రమంలో పార్టి జిల్లా కమిటి సభ్యులు పి.లక్ష్మణ్,డివిజన్ కమిటి సభ్యులు కుంజా కృష్ణ,మండల నాయకులు యర్రగొర్ల రామారావు,పద్దం లక్ష్మణరావు తదితరులు పాల్గోన్నా రు.
Post A Comment: