మన్యం మనుగడ, మణుగూరు:
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ జరుపుకునే సంబురాలలో ఇతరుల ని ఇబ్బంది పెట్టే విదంగా ఉండకూడదు ని మణుగూరు ASP డా*శబరిష్ తెలిపారు.
కొత్త వేరియంట్ ఓమీక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా పోలీసులకు సహకరించాలన్నారు.
సబ్ డివిజన్ పరిధిలోగల మండలాల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రదేశాల్లో పోలీస్ పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని మహిళల పట్ల అసభ్యకరంగ ప్రవర్తించిన కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
సంతోషకరమైన వాతావరణంలో జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారినపడి మీ కుటుంబాలలో విషాదం నింపే పరిస్థితి నెలకొలుపు కో వద్దన్నారు.
ఈ రోజు రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు రెస్టారెంట్లు మూసి వేయాలన్నారు.
వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పట్టణంలో ర్యాలీలు బాణసంచా కార్యక్రమాలు నిషేధం అన్నారు.
ద్విచక్రవాహనంపై త్రిబుల్ రైడింగ్ మైనర్లు రైడింగ్ చేస్తే ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు.
మద్యం మత్తులో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చిన అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అన్నారు..
Post A Comment: