మన్యం మనుగడ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా మట్టపళ్లి సాగర్ యాదవ్ ని 2వ సారి నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. సాగర్ యాదవ్ నియామకం పట్ల టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ని బలమైన శక్తిగా తయ్యారు చేసేందుకు యువతను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
Post A Comment: