మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 137 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తల నడుము ఘనంగా జరుపుకోవడం జరిగింది పినపాక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగుల పకీరయ్య రాసాల రామయ్య మాది నేని నరసింహారావు గుర్రం చెన్నయ్య లను కాంగ్రెస్ కండువా పూలదండ శాలువాతో సత్కరించడం జరిగింది ఆ తర్వాత గాదె కేశవ రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టలేదని భారతీయులని బ్రిటిష్ వారి నుండి కాపాడుకోవడం కోసం 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది ఆనాడు 35 కోట్ల మంది భారతీయులను కాపాడుకుంటూ బ్రిటిష్ వారిని వెళ్లగొట్టి స్వయంపాలన తెచ్చుకునే వరకు పోరాటం చేసిందని ఆ తర్వాత వనరులను సంపదను సృష్టించి రహదారి సౌకర్యం రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పేదలకు భూములు పంచి బ్యాంకుల జాతీయకరణ చేసి పరిశ్రమలు స్థాపించి ప్రజలందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో గర్వంగా బ్రతికేలా చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను పెంచి పెద్ద చేసింది పార్టీ వల్ల నాయకులు కానీ నాయకుల వల్ల పార్టీ కాదు అనే సంగతి గుర్తుంచుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బేతం రామకృష్ణ సర్పంచ్ బట్ట సత్యనారాయణ తూము వీర రాఘవులు కాక రాములు బచ్చు వెంకటరమణ చాప ముత్తయ్య మోసిన్ గంగుల పకీరయ్య రాసాల రామయ్య ఎం నరసింహారావు గుర్రం చెన్నయ్య ఆటో నరసింహారావు చంచల రాము కనితి పద్మ దుర్గం పొడి జ్యోతి ఆది నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: