మన్యం మనుగడ వాజేడు :
ఈరోజు పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో యాక్టివ్ కేస్ పెండింగ్ క్యాంపు నిర్వహించారు. అనుమానిత మరియు నిర్ధారణ అయిన క్షయ వ్యాధిగ్రస్తుల తేమడ ను సేకరించారు
ఈ తేమడ నమూనాలను సి బి ఎన్ ఏ ఏ టి పరీక్ష కొరకు, శరీరం లోపలా ఏమూల లో దాగి ఉన్న క్రీములను అయిన ఈ అత్యాధునిక పరికరం గుర్తించి వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుంది ఈ పరీక్ష కొరకు నమూనాలు సేకరించి మన జిల్లా కేంద్రంలోని క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రమునకు నమూనాలో పంపించడం జరుగుతుంది.
అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్ష ఐ ఆర్ ఎల్ మరియు కల్చర్ కొరకు కూడా ఈ నమూనాలను పంపించడం జరుగుతుంది.
ఈ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ తో పాటు ఇంతకుముందు వ్యాధి నిర్ధారణ అయితే మందులు పనిచేస్తాయా లేవా అనే విషయాన్ని కూడా గుర్తించే శక్తి ఉంటుంది.
ఈ కార్యక్రమంలో పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి పి వేణుగోపాలకృష్ణ హెల్త్ సూపర్వైజర్, హెచ్వి స్టాఫ్ నర్స్ దేవేంద్ర , టీబి సూపర్వైజర్ రవి , ఫార్మసిస్ట్ సతీష్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ అశ్విని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: