మన్యం టీవీ చర్ల:
కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంపై ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టట్ తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షకార్యదర్సులు సోయం రాజారావు,నక్కినబోయిన శ్రీనివాసరావు స్పందించారు.ఈ కార్యక్రమంలో సోయం రాజారావు మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని మరిచి, కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు అండగా సీఎం కేసిఆర్ నిలిచారని అన్నారు. బిజేపి ప్రభుత్వం మెడలు వంచి విజయాన్ని సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు, సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండగా ముఖ్యమంత్రి కేసిఆర్ నిలిచారని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సియం కేసిఆర్ ఆదేశాలతో పార్లమెంట్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు బైకాట్ చేశారని అన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల పక్షాన నిలబడేందుకు దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసేందుకు శ్రీకారం చుట్టి ధర్నాలు చేపట్టడంతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టులను 24 గంటల కరెంట్ నిర్మించి రైతులకు అండగా ఉన్నారని అన్నారు. నూతన చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చినా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించి రైతాంగానికి అండగా నిలిచారని అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. ఇప్పటికైనా బిజేపి, పార్టీ నాయకులు బుద్ది తెచ్చుకోని రైతు వ్యతిరేక నిర్ణయాలను వదిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు తెరాసా ప్రభుత్వం పోరాటం చేసింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు,చర్ల మేజర్ పంచాయతీ,కేశవాపురం, గొమ్ముగూడెం సర్పంచ్లు కాపుల కృష్ణార్జున రావుకోరం నాగేంద్ర, పొడెం మురళి,కేశవాపురం ఉపసర్పంచ్ గోసుల మురళి,పోట్రూ బ్రహ్మానందరెడ్డి,ఎస్ డి అజీజ్,మండలఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్,మండల బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు,పాపిన గంగాధర్, పిఎసియస్ చర్ల డైరెక్టర్లు ముమ్మనేని అరవింద్, యాదాల రాంబాబు,మండలయూత్ అధ్యక్షులు కాకి అనిల్,తడికల లాలయ్య,మీడియా ఇంచార్జ్ పంజా రాజు,గారపాటి బాబీ,సింగ సంతోష్, వంటకాల మహేష్ కల్లూరి శ్రీను,సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: