మన్యంటీవి, అశ్వారావుపేట:పొంగులేటి అభిమాని, పి ఎస్ ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు జక్కుల రాంబాబు కుటుంబాన్ని మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. రోజువారి పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిమాని జక్కుల రాంబాబు కుటుంబాన్ని సందర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జక్కుల రాంబాబు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా జక్కుల రాంబాబు ఇంటి వద్ద హాజరైన గ్రామస్తులతో పొంగులేటి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో జారే ఆదినారాయణ, జూపల్లి రమేష్, సీతారామ స్వామి, విజయ్ బాబు, మట్టా దయానంద్ విజయకుమార్, బానోత్ పద్మావతి, హాతి, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం ప్రజానీకం తో పాటు ఎంపీటీసీలు రమేష్, తిరుపతిరావు, సర్పంచులు కంగాల పరమేష్, కొడిమి సీత, సొసైటీ డైరెక్టర్ మనుగొండ వెంకటేశ్వర్లు, గ్రామ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: