CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతిఒక్కరికి పట్టాలివ్వాలి. -- : న్యూడెమోక్రసి డిమాండ్.

Share it:

 



మన్యం టీవి, అశ్వాపురం:

        పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలివ్వాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు అఖిలభారత రైతుకూలి సంఘం అశ్వాపురం మండల కార్యకర్తల సమావేశంలో మోర రవి మాట్లాడుతూ 2014 జూన్ 2 వ తేదీని కటాఫ్ తేదిగా నిర్ణయించి ప్రతిఒక్క గిరిజన, ఆదివాసీ, గిరిజనేతర పేద పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీశాఖ వారు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని  2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణ కు గురైన దరఖాస్తుదారులoదరికీ పట్టాలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు అనేక గ్రామాల్లో అధికార బలం ఉన్న వారితో పోడుభూమి కమిటీలు ఏకపక్షంగా వేశారని ఇలాంటి చోట్ల పక్షపాత వైఖరితో కొంతమందికి పోడు సాగు దారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పోడు సాగు దారులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని అన్నారు పోడు సాగు దారులు అందరికీ న్యాయం జరిగే విధంగా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు అడవి మధ్యలో  పోడువ్యవసాయo ఉండడానికి వీల్లేదని ప్రభుత్వ వాదనలో హేతుబద్ధత లేదని విమర్శించారు పోడు వ్యవసాయం అడవిలో కాక ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు వలస ఆదివాసీలకు హక్కు లేదనడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని అన్నారు రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు సమాన హక్కులు వర్తిస్తాయని అన్నారు మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామని సర్వేల పేరుతో రైతుల దగ్గర లంచాలు తీసుకునే అటవీశాఖ అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే మధ్య దళారీల ప్రమేయం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బండ్ల వెంకటేశ్వర్లు ఇరప ఎర్రయ్య భీమన్న సీతమ్మ ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: