గుండాల నవంబర్ 8 (మన్యం మనుగడ) కాచన పల్లి అమరుల స్ఫూర్తి ఉద్యమిస్తామని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గనయకులు చలపతిరావు అన్నారు. ఆదివారం రాత్రి మండలం పరిధిలో కాచన పల్లి గ్రామంలో గల అమరవీరుల స్తూపం వద్ద సంతాప సభ నిర్వహించారు. అనంతరం చలపతిరావు జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు మాట్లాడుతూ కాచన పల్లి అమరుల త్యాగం వేల లేనివని వారు అన్నారు. చంద్రపుల్లా రెడ్డి పోరాట స్ఫూర్తి పోరాడుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నమని వారు అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంతవరకు ఉద్యమం ఆగదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల వెంకన్న , గుండాల జడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు, పీ వై ఎల్ నాయకులు రవి, వై వెంకన్న , ఎస్ కె అజ్గర్, ఈ సం కృష్ణ , కోరం సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు
Post A Comment: