మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రము ఐటిడిఎ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో గురువారం యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళా.ఈ జాబ్ మేళా కు ముఖ్య అతిథులుగా ఐ టి డి ఎ ఏపీవో వసంతరావు హాజరై మాట్లాడుతూ.ఈ జాబ్ మేళా ను గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ జాబ్ మేళా కు అపోలో ఫార్మసీ,శుభ గృహ,కృషి బయో ఫర్టిలైజర్,ఎస్ఎస్ బయో ప్లాంటేషన్ మొదలగు ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు 164 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనారు. వీరిలో అపోలో ఫార్మసీ కి పదిమంది,శుభ గృహకు 18 మంది,కృషి బయో ఫర్టిలైజర్ కు 38 మంది,ఎస్ఎస్ బయో ప్లాంటేషన్ కు 23 మంది, నవత ట్రాన్స్పోర్ట్ కు 42 మంది, ఎంపికయ్యారు.ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జె డి ఎం కొండలరావు,జెఆర్ పి ఎస్ లు బిక్షపతి,పాపారావు, సరస్వతి,మహేష్,అపోలో హెచ్ ఆర్ మేనేజర్ శ్రీనివాస రావు,శుభ గృహ హెచ్ ఆర్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్ఎస్ బయో ప్లాంట్ ప్రతినిధి కృషి బయో ఫెర్టిలైజర్స్ ప్రతినిధులు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
Post A Comment: