మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్ అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్.చందా సంతోష్ కుమార్ హాజరై,కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి,రాష్ట్ర అధ్యక్షులు ఆయురారోగ్యాలతో,కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా,భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రాబోయే 2023 ఎలక్షన్ లోపు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి నాయకత్వం లో పినపాక నియోజకవర్గం,మణుగూరు మండలం లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకు స్వీకరానికి ప్రతీకార్యకర్త నడుబిగించి,అత్యధిక నమోదు చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు కోడేం. సాంబశివరావు,జాయింట్ సెక్రటరి ఎండి.షరీఫ్,మండల మహిళా నాయకురాలు ఎండి. షబాణ,యువజన నాయకులు కొమ్ము,నాగేంద్ర బాబు,లక్ష్మి, సాంబ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: