మన్యం టీవీ మంగపేట.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని రైతుబంధు మండల కోఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి కోరారు. మండలంలోని చేరుపల్లి గ్రామంలో ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (ఓ.డి.సి.ఎం.ఎస్ )ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, తెరాస మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, సహకార సంఘం డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, సోషల్ మీడియా ఇంఛార్జి గుడివాడ శ్రీహరి, కొనుగోలు కేంద్రం ఇంఛార్జిలు దిడ్డి శ్రీనివాస్, పూజరి సతీశ్, రాంగాని నరేందర్, బట్టు నర్సింహారావు, చేరుపల్లి గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: