మన్యం టీవీ, అశ్వాపురం:గొందిగుడెం గ్రామం అశ్వపురం మండలంలోని వనికరణ సంఘా రైతులకు సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో రైతు పొలం బడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ డైరెక్టర్ కృష్ణ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ముందుగా డైరెక్టర్ గారు మాట్లాడుతూ మన మండలంలోని అన్ని గ్రామల్లో సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామానికి ఒక మోడల్ రైతుని ఎన్నికుని ఆ రైతుకు ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ ద్వారా తొర్పాటును అందిస్తూ వృక్ష సంయుత వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తూ చిన్న సన్నకారు రైతులకు ఉన్నటువంటి చిన్న కమతంలలో ఒకే పంట కాకుండా రెండు పంటలు పండే విధంగా సాగు పట్ల శిక్షణ లను ఇస్తూ ప్రతీ సంవత్సరం అంతర పంటల మీద ఆదాయం పొందుతూ ప్రధాన పంట ఆయన జమాయెల్ మీద ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి అధిక ఆదాయం వచ్చేలా వారిని ప్రోహహించడం జరుగుతుంది. కొమరం బద్రమ్మ అనే రైతు తనకు ఉన్నటువంటి 5.00 ఎకరాల భూమిలో వృక్ష సంయుత వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందినందుకు గాను ఐ టి సి పి ఎస్ పీ డి వారి నుండి అవార్డ్ లభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మరియు ఐటీసీ ఎం స్ కె మేనేజర్ హేమంత్ ఆదర్శ రైతుని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం స్ కె మేనేజర్ హేమంత్ గారు మరియు ఎస్ ఎస్ ఎస్ జి ఎస్ సంస్థ డైరెక్టర్ కృష్ణ కిశోర్ గారు, గ్రామ సర్పంచ్ పాయం భద్రమ్మ, ఫీల్డ్ స్టాఫ్ సతీష్, రంగారావు , ముత్యలరావు మరియు గ్రామ రైతులు హాజరుకావడం జరిగింది.
Post A Comment: