గుండాల నవంబర్ 1 (మన్యం మనుగడ) ఘనంగా న్యూ డెమోక్రసీ పార్టీ అమరవీరుల వర్ధంతి సభను మండల కేంద్రంలోని బాటన్న స్మారక స్థూపం వద్ద నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ సీతారాములు మాట్లాడుతూ. ఎందరో అమరవీరులు తమ విలువైన ప్రాణాలను ఉద్యమం కోసం అంకితం చేశారన్నారు. భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన అమరులను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎందరో మహనీయులు ఉద్యమంలో పనిచేసి అసువులు బాశారు వరీ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, న్యూ డెమోక్రసీ ఆరెం నరేష్ , వై వెంకన్న , అజ్గర్ , ఈ సం కృష్ణ , పెంటన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment: